కోట్లతో కార్యకర్తల స్పష్టీకరణ

Published: Friday February 01, 2019

 à°®à±à°–్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తొలిసారిగా కార్యకర్తలు, ముఖ్య నాయకులు, అనుచరులతో భేటీ అయ్యారు. గురువారం కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కోడుమూరు, గూడూరు, కర్నూలు, ప్యాపిలి మండలాలతో పాటు ఆదోని పట్టణ శ్రేణులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇటీవల విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో à°’à°‚à°Ÿà°°à°¿ పోరు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసి తాను బయటకు వచ్చిన పరిణామాలను వారికి వివరించారు. అదే క్రమంలో చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతిలో సీఎం ఇంటికి విందుకు వెళ్లాల్సిన పరిస్థితులను కార్యకర్తలకు తెలియజేశారు. భవిష్యత్‌ కార్యాచరణపై అభిప్రాయాలు తెలపాలని వారిని కోరా రు. కోట్ల ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వారంతా నినదించారు. ‘ఇన్నాళ్లూ మీ వెంటే ఉన్నాం.. మీరు అధికారంలో ఉండగా ఎన్నో పనులు చేయించుకున్నాం.. ఇలాంటి సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మేం మీ వెంటే’ అని కార్యకర్తలు, ముఖ్య నాయకులు కోట్లకు స్పష్టం చేసినట్లు తెలిసింది. 8à°µ తేదీ తర్వాత ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నాయని కోట్ల వర్గీయులు పేర్కొన్నారు.