శిశువును అమ్మేసిన డాక్టర్

Published: Saturday February 09, 2019

మచిలీపట్నం: à°•à±ƒà°·à±à°£à°¾ జిల్లా మచిలీపట్నం వాణి ఆస్పత్రిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన మగశిశువును తల్లికి తెలియకుండా డాక్టర్ అమ్మేసింది. కుటుంబసభ్యులు ప్రశ్నించగా కడుపులో శిశువు లేదని గడ్డని మాత్రమే బయటకు తీశామని డాక్టర్ చెబుతోంది. బాధితురాలు కనకుదుర్గకు సంబంధించిన రికార్డును డాక్టర్ మాయం చేసింది. దీంతో డాక్టర్‌ను బాధితురాలి బంధువులు నిలదీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని డాక్టర్ వాణి, నర్సు కుసుమను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.