గోవిందా..గోవిందా అంటూ లోక్‌సభలో టీడీపీ ఎంపీలు

Published: Tuesday February 06, 2018

ఢిల్లీ: ఉదయం సభ ప్రారంభమైనప్పట్నుంచి  లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభను స్తంభింపజేశారు. మరోవైపు టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో చిడతలు వాయిస్తూ, గోవిందా..గోవిందా అంటూ నారదుడి వేషంలో నిరసన తెలియజేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ ముగిసేవరకూ సహకరించాలంటూ రాజ్‌నాథ్‌సింగ్..సుజనాచౌదరిని పిలిచి మాట్లాడారు. అయినా టీడీపీ ఎంపీలు మాత్రం వెనక్కి తగ్గకుండా సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతూ ఆందోళనను కొనసాగిస్తున్నారు.