అజ్ఞాతవ్యక్తి ఫిర్యాదు ఆధారంగా దాడులు

Published: Tuesday February 19, 2019
తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించే అమలాపురంలోని మోబర్లీపేటకు చెందిన అల్లాడ సోదరుల ఇళ్లపై సోమవారం ఇన్‌కంటాక్స్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముగ్గురు ఇళ్లలో కీలక డాక్యుమెంట్లతోపాటు ఇతర బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలపై అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మోబర్లీపేటలో నివాసముంటున్న అల్లాడ స్వామినాయుడు, అల్లాడ వాసు, అల్లాడ శరత్‌లకు చెందిన ఇళ్లపై పదిమంది సభ్యులతో కూడిన ఐటీ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి ముగ్గురి సోదరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈసోదాల్లో కీలక డాక్యుమెంట్లు, కొంత నగదుతోపాటు ఇతర లావాదేవీలపై సోదాలు చేస్తున్నారు. ఇన్‌కంటాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎంవీ రమేష్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రాత్రి 9 à°—à°‚à°Ÿà°² సమయంలో కూడా సోదాలను కొనసాగిస్తున్నారు. ఇటీవలకాలంలో అల్లాడ సోదరులకు సంబంధించిన కొంత భూమిని విక్రయించారు.
 
   à°¦à°¾à°¨à°¿ విలువ రూ.12 కోట్లుగా చూపడంతో à°† భూమి లావాదేవీలపై అనుమానం వచ్చిన అధికారులు ప్రధానంగా దృష్టిసారించి విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. గతంలో అపార్ట్‌మెంట్లు, ఇతర నిర్మాణాల్లో భాగస్వామ్య వ్యవహారాలపై కూడా దృష్టిసారించారు. అదేవిధంగా ఆడిటర్‌ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించిన తర్వాత కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. తొలుత అల్లాడ స్వామినాయుడు ఇంటి వద్ద సోదాలు జరిపారు. à°† తర్వాత అల్లాడ వాసు, శరత్‌ ఇళ్లలోనే ఐటీ అధికారులు సోదాలు రాత్రి సమయంలో కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఎవరో అజ్ఞాతవ్యక్తి మూడు నెలల క్రితం అల్లాడ సోదరుల లావాదేవీలపై ఐటీశాఖకు చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని వీరి లావాదేవీలపై నిఘా పెట్టిన ఐటీ అధికారులు సోమవారం à°ˆ ఆకస్మిక దాడులకు దిగారని ప్రచారం కూడా జరుగుతోంది. అల్లాడ సోదరులు టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూండటంతో ఐటీ దాడులు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.