హోదా కోసం సీఎం పోరాటం

Published: Friday February 22, 2019

 à°®à°¾à°°à±à°šà°¿ 1à°¨ విశాఖపట్నం రానున్న ప్రధాని మోదీకి నిరసనలతో స్వాగతం పలుకుతామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో నల్లదుస్తులు ధరించి, చేతికి సంకెళ్లు వేసుకుని, మట్టికుండలతో ప్రధానికి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. హోదా ఇవ్వకుంటే తెలుగుప్రజలు అత్యధికంగా నివసించే ఒడిసా, తమిళనాడు, కర్ణాటక ల్లోనూ రానున్న ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తామన్నారు. హోదాకోసం, బీజేపీ ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయంపై సీఎం చంద్రబాబు పోరాటం కొనసాగించాలని కోరారు. సమితి కో-కన్వీనర్లు ముప్పాళ్ల నాగేశ్వరరావు, దోనేపూడి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.