ఏపీకి మద్దుతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ

Published: Thursday February 08, 2018

లోక్‌సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ న్యాయం చేయాలంటూ టీడీపీ ఎంపీలు నాలుగు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా మద్దతు తెలపని కాంగ్రెస్ పార్టీ.. నేడు అనూహ్యంగా ఏపీకి మద్దుతు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఏపీ విభజన చట్టం, హోదాపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ నోటీస్ ఇచ్చింది. 184 నిబంధన à°•à°¿à°‚à°¦ ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ, ఓటింగ్ జరపాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌à°•à°¿ కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే నోటీసులు అందజేశారు.

అంతకుముందు పలువురు టీడీపీ ఎంపీలు.. కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీని కలిసి ఏపీ సమస్యలను వివరించారు. ఏపీ పరిస్థితులపై ఎంపీలను ఆరా తీసిన సోనియా.. సభలో తప్పకుండా మద్దతిస్తామని, ఏపీ కోసం పోరడాతమని హామీ ఇచ్చారు.