వెనుకడుగు వేయవద్దు - ఎంపీలకు సూచించిన చంద్రబాబు

Published: Friday February 09, 2018

అమరావతి: à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚టు నుంచి సస్పెండైనా వెనుకడుగు వేయవద్దని టీడీపీ ఎంపీలకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆపార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం తీరు అసంతృప్తిని మిగిల్చిందని, ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని చంద్రబాబు సూచనలు జారీ చేశారు. అంతేగాక ఇవాళ పార్లమెంట్‌ ఉభయ సభల్లో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.