ట్విటర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీ

Published: Friday February 09, 2018

న్యూఢిల్లీ : à°•à°¾à°‚గ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఆంధ్రుల డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం లభించాలంటే అన్ని పార్టీలూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోంది. న్యాయం కోసం అన్ని పార్టీలూ ఏకమవ్వాల్సిన సమయమిది’’ అని ఆయన ట్వీట్ చేశారు.