అర్ధరాత్రి చంద్రబాబు నివాసానికి వంగవీటి రాధా

Published: Tuesday March 12, 2019
అమరావతి: à°µà±ˆà°¸à±€à°ªà±€à°•à°¿ రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ అసలు ఏ పార్టీలోకి వెళ్లాలో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. రాజీనామా చేసిన రెండ్రోజులకే ఆయన పసుపు కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. అంతేకాదు రాధా టీడీపీలోకి వస్తున్నారని.. అందరూ సహకరించి కలిసి మెలిసి పనిచేయాలని స్వయానా సీఎం చంద్రబాబే చెప్పారు. అయితే à°ˆ మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ మళ్లీ సైకిలెక్కకుండా సైలెంట్ అయిపోయారు. దీంతో మరోసారి విజయవాడకు చెందిన వైసీపీ కీలకనేతలు రంగంలోకి దిగి పార్టీలోకి à°°à±€-ఎంట్రీ ఇవ్వాలని మంతనాలు కూడా జరిపారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
 
 
అయితే.. à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ అర్ధరాత్రి సీఎం చంద్రబాబు నివాసానికి వంగవీటి రాధా వెళ్లారు. మాజీ ఎంపీ లగడపాటితో కలిసి రాధా .. సీఎంతో భేటీ అయ్యారు. సుమారు రెండుగంటలపాటు రాధా తన రాజకీయ భవిష్యత్‌పై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపో.. మాపో వంగవీటి రాధా పసుపు కండువా కప్పుకుంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా.. రాధా టీడీపీలో చేరితే ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? అసలు పోటీ చేస్తారా..? లేదా..? అనే విషయంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అయితే వంగవీటి అభిమానులు, అనుచరులు మాత్రం విజయవాడ సెంట్రల్ నుంచే పోటీ చేయాలని రాధాపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.