టీడీపీ అభ్యర్థి వేట కొడవళ్లతో దాడి

Published: Saturday March 16, 2019
జిల్లాలోని మంత్రాలయం మండలం ఖగ్గలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ- వైసీపీ వర్గీయుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాల్లోకి కాల్పులు జరిపారు. కాగా ఘర్షణలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు వేటకొడవళ్లతో దాడికి యత్నించారు. à°ˆ ఘర్షణలో à°Žà°¡à°® కాలికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన నేతలు ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏఎస్సై తిరుపాల్‌కు కూడా గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం తిరుపాల్‌ను ఆస్పత్రికి తరలించడం జరిగింది.
అయితే ఈ కాల్పులు జరిపిందెవరు..? కాల్పులు జరిపేదాక పరిస్థితి ఎందుకెళ్లింది..? కాల్పులు జరిపిన వ్యక్తులకు తుపాకులు ఎక్కడ్నుంచి వచ్చాయి..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.