రాష్ట్ర ప్రయోజనాలపై రేపు వామపక్షాల భేటీ : సీపీఎం

Published: Tuesday February 13, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలపై రేపు (బుధవారం) వామపక్షాల భేటీ జరగనుందని సీపీఎం నేత మధు వెల్లడించారు. à°† సమావేశం తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటమంటున్న టీడీపీ నాలుగేళ్లుగా ఏం చేస్తోందని మధు ప్రశ్నించారు. మండల కేంద్రాల వద్ద ధర్నాలతో వైసీపీ నాటకాలాడుతోందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని మధు సూచించారు.