ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు : సోము వీర్రాజు

Published: Tuesday February 13, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... దుగ్గరాజపట్నం పోర్టుపై తొలినుంచి వివాదాలు ఉన్నాయన్నారు. పోర్టు కోసం భూసేకరణ చేస్తే నిర్మిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. అలాగే కమిటీ నివేదిక వచ్చాక à°•à°¡à°ª స్టీల్‌ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకుంటారని వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు, సంస్థలు ఇచ్చిందని, à°† నిధులు ఎక్కడ ఖర్చుచేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లు, పదేళ్లలో నిర్మించాలని చట్టంలో లేదని వీర్రాజు పేర్కొన్నారు.