హాస్యనటుడు గుండు హనుమంతరావు ఇక లేరు

Published: Monday February 19, 2018

ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) కన్నుమూశారు. . à°ˆ ఉదయం 3.30 à°—à°‚à°Ÿà°² సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు డాక్టర్లు. 1956 అక్టోబర్ 10à°¨ విజయవాడలో ఆయన జన్మించారు. నాలుగు వందలకు పైగా సినిమాల్లో గుండు హనుమంతరావు నటించారు. ఇటీవల à°“ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ తన అనారోగ్య విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదన్నారు. దీంతో విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయనకు ఆర్థిక సాయం అందించారు.

18ఏళ్ల వయసులో గుండు హనుమంతరావు నాటకరంగ ప్రవేశం చేశారు. నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం రావణబ్రహ్మ. స్టేజీ షోలతో ఆయన చాలా పాపులర్‌ అయ్యారు. 400 సినిమాల్లో నటించిన గుండు హనుమంతరావు తొలి చిత్రం à°…à°¹ నా పెళ్లంట. ఆయనకు బాగా పేరు తెచ్చిన సీరియల్ అమృతం. గుండు హనుమంతరావు మూడు సార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. ఆయన నటించిన చిత్రాలు..బాబాయి హోటల్‌, పేకాట పాపారావు, అల్లరి అల్లుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, క్రిమినల్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, కలిసుందాం à°°à°¾, సత్యం, పెళ్లాం ఊరెళితే, అతడు, భద్ర, ఆట, మస్కా. గుండు హనుమంతరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.