రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

Published: Wednesday April 17, 2019

 ‘‘బై అన్నా... బై వదినా.. బై à°… మ్మా.. బై డాడీ.. బై విక్రమ్‌, బై ముకేష్‌... ఇదే మా లాస్ట్‌ వీడియో... మేము బతకాలనుకోవడంలేదు.. మాఇద్దరికీ పెళ్లి కూడా అయింది... విడిపోలేకపోతున్నాం... అందుకే చచ్చిపోతున్నాం... మా చావే అందరికీ హెచ్చరిక కావాలి. చనిపోతున్నందుకు నిజంగానే చాలా బాధపడుతున్నాం.. బై గుడ్‌బై..’’ అంటూ à°“ ప్రేమ జంట సెల్ఫీ వీడియో తీసుకుని రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, మొరవపల్లె దళితవాడకు చెందిన దొరస్వామి, రాజమ్మ దంపతుల చిన్న కొడుకు ధనంజయులు(19) జేసీబీ ఆపరేటర్‌. ఏడాది క్రితం శ్రీకాళహస్తికి చెందిన రవి కుమార్తె పల్లవి(16)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈనెల 12à°¨ విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో పల్లవి ఫెయిలైంది. అదేరోజు ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ధనంజయులు కూడా 12à°¨ జేసీబీ à°ª నుల నిమిత్తం రొంపిచర్లకు వెళుతున్నట్లు చెప్పి వెళ్లిపోయా డు. రెండు రోజుల క్రితం పల్లవి, ధనుంజయులు à°“ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున మొరవపల్లె వద్ద రైలు à°•à°¿à°‚à°¦ పడి ఆత్మహత్య చేసుకున్నారు. పాకాల రైల్వే పోలీసులు మృతదేహాలను తిరుపతి ఎస్వీ కళాశాలకు తరలించి కేసు నమోదు చేశారు.