ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం

Published: Friday May 31, 2019
 à°µà±ˆà°¸à±€à°ªà±€ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి రావడం ఖాయమని వైసీపీ నాయకుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు. మర్రి రాజశేఖర్‌తో వైసీపీ నాయకులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి గురువారం పట్టణంలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ముందుగా వారు మర్రికి అభినందనలు తెలిపారు. వైసీపీ నియోజకవర్గ సమన్వ యకర్తగా మర్రి రాజశేఖర్‌ స్థానంలో విడదల రజినీని ప్రకటించిన సమయంలోనూ జగన్‌ ఆదేశాల మేరకు ఆళ్ల పట్టణంలోని మర్రి నివాస గృహానికి వచ్చి మాట్లాడారు.
 
 
వైసీపీ అధికారంలోకి వస్తే మర్రి రాజశేఖర్‌‌కు మంత్రి పదవి కూడా ఇస్తానన్నారని జగన్‌ తనతో చెప్పారని నాయకులు, కార్యకర్తల సమక్షంలో హామీ కూడా ఇచ్చారు. à°ˆ సంద ర్భంగా ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా నుంచి నిజాయతీ పరులైన ఆళ్ల రామకృష్ణారెడ్డికి, మర్రి రాజశేర్‌లకు మంత్రి పదవులు రావడం ఖాయమని తెలిపారు. à°ˆ సందర్భంగా అక్కడ ఉన్న మర్రి అనుచరులు సంతోషం వ్యక్తం చేశారు.