1500కి.మీ దాటిన ప్రజా సంకల్పయాత్ర

Published: Wednesday March 14, 2018

పొన్నూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బుధవారం 1500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు గ్రామంలోకి ప్రవేశించిన జగన్‌ 1500 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తిచేసినట్లు వైకాపా నాయకులు తెలిపారు. à°ˆ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి జగన్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. గుంటూరు పార్లమెంటు నియోజకర్గ వైకాపా అధ్యక్షుడు రావి వెంకటరమణ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.