భీమవరం నుంచి కైకలూరు మీదుగా విజయవాడకు ఏసీ బస్‌ సర్వీసులు

Published: Thursday March 15, 2018


 à°†à°°à±à°Ÿà±€à°¸à±€ బీమవరం నుంచి కైకలూరు మీదుగా విజయవాడకు ఏసీ బస్సు సర్వీసులను బుధవారం నుంచి ప్రారంభించినట్లు గుడివాడ డిపో మేనేజర్‌ బాలాజీదయాళ్‌ బుధవారం à°’à°• ప్రకటనలో తెలిపారు. ఇటీవల కలిదిండి బస్‌స్టేషన్‌ శంకుస్థాపన సందర్భంగా ఆర్టీసీ à°Žà°‚à°¡à±€ మాలకొండయ్యను భీమవరం నుంచి వయా కైకలూరు మీదుగా ఏసీ బస్‌ సర్వీసులను విజయవాడ వరకు తిప్పాలని ఎంపీ మాగంటిబాబు కోరిన విషయం విదితమే. రెండు బస్సులు రెండు సార్లు విజయవాడ వస్తాయని, ఉదయం 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరి 10.45 భీమవరం చేరుకుంటుందన్నారు.
 
మధ్యాహ్నం 2.15 గంటలకు భీమవరం నుంచి బయలుదేరి విజయవాడకు సాయంత్రం 5.45 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. మరో బస్సు ఉదయం 9. గంటలకు భీమవరంలో బయలుదేరి 11.30 గంటలకు విజయవాడ చేరుతుంది. సాయంత్రం 4.15 గంటలకు భీమవరంలో బయలుదేరి 6.30 గంటలకు విజయవాడ చేరుతుందన్నారు. అవసరం మేరకు మరిన్ని బస్సులు పెంచుతామన్నారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.