హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

Published: Sunday June 16, 2019
ఉద్దేశపూర్వకంగానే తనపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్‌ కోడెల శివరాం అన్నారు. శనివారం à°ˆ మేరకు ఆయన à°’à°• ప్రకటన విడుదల చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగా తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ముఖపరిచయం లేని వారు కూడా అధికారపార్టీ ఒత్తిళ్ళకు లొంగి తమ కుటుంబంపై కేసులకు తెగబడుతున్నారన్నారు. ఒక్కదానికి రుజువులు లేవన్నారు. ఇకపైన తప్పక న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న తనపైన కుట్రలో భాగంగానే ఇటువంటి వాటిని అధికార పార్టీ నేతలు ఉసిగొల్పుతున్నారన్నారు. అదే విధంగా తన వాహనాలను వెంటాడుతూ హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. à°ˆ విషయమై నరసరావుపేట డీఎస్పీకి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు.
 
ఇటువంటి వాటికి దడిచేది లేదని మొదటి నుంచి పార్టీయే ప్రాణంగా ఉన్న తమ కుటుంబం ఎప్పుడూ పార్టీకి విధేయతగానే ఉంటుందన్నారు. అదే విధంగా తాను అజ్ఞాతంలో ఉన్నానని దుష్ప్రచారం చేస్తున్నారని, తాను ప్రతిరోజూ కార్యకర్తలకు అందుబాటులోనే ఉన్నానని తెలిపారు. పార్టీలో ఏ పదవీ ఆశించకుండా నిబద్ధత గల కార్యకర్తగా అధినేత చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశానన్నారు. ఇదే విధానాన్ని చివరి వరకు కొనసాగిస్తానని కోడెల శివరాం తెలిపారు.