విశాఖపట్నం పూర్వ ఆర్డీవో ఎస్‌.వెంకటేశ్వర్లుపై క్రిమినల్‌ కేసు

Published: Saturday March 17, 2018

  à°µà°¿à°¶à°¾à°–పట్నం ;   à°µà°¿à°¶à°¾à°–పట్నం పూర్వ ఆర్డీవో ఎస్‌.వెంకటేశ్వర్లుపై క్రిమినల్‌ కేసు నమోదుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయాలని రెవెన్యూ యంత్రాంగం నిర్ణయించింది. ఇటీవల వరకు ఆర్డీవోగా పని చేసిన ఎస్‌.వెంకటేశ్వర్లు తొమ్మిది ఆర్డర్లను జారీ చేయడం ద్వారా ప్రయివేటు వ్యక్తులకు సుమారు 45 ఎకరాలు ధారాదత్తం కావటానికి కారణమయ్యారని కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అనంతరం ఆయన్ను సరెండర్‌ చేశారు. కలెక్టరు నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది. తాజాగా క్రిమినల్‌ కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సంయుక్త కలెక్టర్‌ జె.సృజన విలేకరులకు తెలిపారు.