బీజేపీతో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు : మంత్రి గంటా

Published: Sunday March 18, 2018

విశాఖపట్నం: à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°­à°¿à°µà±ƒà°¦à±à°§à°¿ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగువారి ఆత్మగౌరవ పోరాటానికి సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటి నుంచి ఢిల్లీలో ప్రకంపనలు మొదలయ్యాయని అన్నారు. టీడీపీ అవిశ్వాసానికి 150 మంది ఎంపీల మద్దతుందని వెల్లడించారు. బీజేపీతో పొత్తు కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.