వరద బాధితులను ఆదుకుంటాం

Published: Monday August 19, 2019
 à°•à±ƒà°·à±à°£à°¾à°¨à°¦à°¿ వరద బాధితులకు ప్రభుత్వం à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీఎం జగన్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు పరిహారాన్ని సకాలంలో అందిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్టు సుచరిత చెప్పారు. కృష్ణా వరదల వల్ల ముంపునకు గురైన గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో ఆదివారం ఆమె పర్యటించారు.
 
మొదట ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తర్వాత కొల్లూరు మండలం దోనేపూడిలో వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం, భట్టిప్రోలు మండలం వెల్లటూరులో పునరావాసకేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణానది వరద కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 7,363 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనావేశామని తెలిపారు.