శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఘోరం

Published: Sunday April 29, 2018

కారు బోల్తా పడి భార్యాభర్త దుర్మరణం.. మరో నలుగురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులను సున్నిపెంట ఆసుపత్రికి తరలింపు
శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం

మహబూబ్ నగర్, దోమలపెంట: à°¶à±à°°à±€à°¶à±ˆà°²à°‚ ఘాట్‌ రోడ్డులో కారు బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురి à°•à°¿ తీవ్ర గాయాలయ్యాయి. ఈగల పెంట ఎస్సై బద్యానాయక్‌ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన భార్యా భర్తలు అంజిరెడ్డి(28), అశ్విని(24)లు తమ మిత్రులతో కలిసి శ్రీశైల మల్లన్న దర్శనం కోసం కారులో బయలుదేరారు. దోమల పెంటకు 5 à°•à°¿.మీ. దూరంలో పీనిగల గొంది సమీపానికి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. దీంతో అంజిరెడ్డి, అశ్వినిలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితోపాటు కారులో ప్రయాణిస్తున్న మహ్మద్‌ అలీ, కిషోర్‌, రవి కిరణ్‌, రూకేష్‌లకు తీవ్ర గాయాలు కావడంతో సున్నిపెంట ఆసుపత్రికి తరలించారు. వీరంతా హైదరాబాద్‌లో టెక్‌ మహీంద్రా కంపెనీలో పని చేస్తున్నారు. అంజిరెడ్డి, అశ్వి నిలకు ఆరు నెలల క్రితమే వివాహమైంది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.