వైస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్న కాటసాని

Published: Sunday April 29, 2018

కర్నూలు: మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కొద్దీ సేటి క్రితం వైఎస్‌జగన్‌ సమక్షంలో వైఎస్సార్సీలో చేరారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ వద్దకు భారీ కాన్వా§à±‌ుతో కాటసాని వచ్చారు. కాటసానికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాటసానితో సహా వందలాది మంది ఆయన అనుచరులు కూడా వైఎస్సార్సీలో చేరారు. కర్నూలులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని à°ˆ సందర్భంగా జగన్‌ వారికి సూచించారు. కాటసాని మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకై జగన్‌ చేస్తున్న నిర్విరామ పోరాటాన్ని చూసి తాను స్ఫూర్తి పొందానని, ఇకపై ఆయన అడుగుజాడల్లో నడుస్తానని కాటసాని చెప్పారు.