498 ఎకరాలపై బాలయ్య చిన్నల్లుడు క్లారిటీ

Published: Wednesday August 28, 2019
బొత్స వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, టీడీపీ నేత శ్రీభరత్‌ ఖండించారు. అమరావతిపై బురద చల్లడానికి తనను పావుగా వాడుకుంటున్నారని, తనను చూపించి వేల రైతులకు అన్యాయం చేయవద్దని చెప్పారు.
 
"ఎన్నికల్లో ఆరోపణలు చేసినా ఊరుకున్నా కానీ.. ఎన్నికల తర్వాత కూడా నాపై బురద చల్లడం దారుణం. అమరావతికి 120 కిలోమీటర్ల దూరంలో సీఎం వియ్యంకుడికి.. స్థలం ధారాదత్తం చేశారని బొత్స అసత్య వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ బేస్ పవర్ ప్లాంట్ కోసం 2007లో 498.39 ఎకరాలు తీసుకున్నాం. బొత్స చూపించిన జీవోను 2012లో ఇచ్చారు. నా పెళ్లికి ముందు జరిగిన వ్యవహారాన్ని తర్వాత పరిణామాలకు ముడి పెడుతున్నారు. ప్రాజెక్ట్ మొదలు పెట్టె సమయంలో ఏపీఐఐసీ ధర పెంచింది. ఉద్దేశపూర్వకంగా రక్షణ స్టీల్ స్థలంపై హైకోర్టుకు వెళ్లారు" అని శ్రీభరత్ చెప్పారు.