అహ్మద్‌నగర్‌లో వెలుగు చూసిన ఎన్సీపి కార్యకర్తల దారుణ హత్య

Published: Sunday April 29, 2018


 

ముంబాయిః ఇద్దరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. అహ్మద్ నగర్ జిల్లాలోని జమ్ ఖెడ్ నగరంలో రోడ్డు పక్కన నిలుచుని ఉన్న ఇద్దరు ఎన్సీపీ కార్యకర్తలను మోటార్ బైక్ పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపి పరారయ్యారు. అతి దగ్గర నుంచి ఎనిమిది రౌండ్లు కాల్పులు జరపడంతో ఎన్సీపీ కార్యకర్తలు ఇరువురూ అక్కడిక్కడే మరణించారు. మృతులకు జామ్ ఖెడ్ కు చెందిన యోగేష్ అంబాదాస్ రాలెభట్, రాకేష్ అర్జున్ రాలెభట్ గా గుర్తించారు. ఈ హత్యలకు సంబంధించి ఇంత వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.