కోడెల వేధింపులకు గురై చనిపోయారు

Published: Tuesday September 17, 2019
వైసీపీది టెర్రరిస్టు ప్రభుత్వమే కాదని... అంతకంటే ఎక్కువ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కోడెల బలవన్మరణంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించి చంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు టైగర్‌à°—à°¾ కోడెలకు గుర్తింపు ఉందన్నారు. కోడెలలాంటి వ్యక్తే అవమానాలను భరించలేకపోయారన్నారు. కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించారని చంద్రబాబు మండిపడ్డారు. దేశ చరిత్రలో à°“ సీనియర్‌ నేత ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
 
కోడెలలాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం బాధాకరమన్నారు. కేసులు, వేధింపులతో కోడెల కుటుంబాన్ని చెల్లాచెదురుచేశారని.. కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. తన ఇంట్లోని ఫర్నిచర్‌ తీసుకెళ్లాలని...అసెంబ్లీ కార్యదర్శికి కోడెల నాలుగు లేఖలు రాశారన్నారు. కానీ అసెంబ్లీ కార్యదర్శి కనీసం స్పందించలేదన్నారు. రూ.43వేల కోట్లు దోచుకుని, 11 చార్జిషీట్లలో జగన్‌ ముద్దాయన్నారు. కేవలం రూ.లక్ష, రెండు లక్షలు విలువైన ఫర్నిచర్‌ విషయంలో...కోడెల శివప్రసాదరావుపై కేసులు పెట్టడం శోచనీయమన్నారు. కోడెలది ఇప్పటికీ కిరాయి ఇల్లేనని చంద్రబాబు పేర్కొన్నారు.
 
కోడెలపై 19 కేసులు పెట్టారని, పాత కేసులు తిరగదోడారన్నారు. కోడెలకు వ్యతిరేకంగా కేసులు వేయాలని... ట్విట్టర్‌లో, పేపర్‌లో విజయసాయిరెడ్డి ప్రకటనలు చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సాక్షి పేపర్‌లో పదేపదే కోడెలను విమర్శిస్తూ కథనాలను రాయించారన్నారు. అనేక చీటింగ్‌ కేసుల్లో నిందితుడైన రంజీ క్రికెటర్‌ నాగరాజుతో... ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు వేయించారన్నారు. డీజీపీని సంప్రదించినా తన వల్ల కాదని తిప్పి పంపారని చంద్రబాబు స్పష్టం చేశారు.