బద్రీనాధ్ లో పూజలు ప్రారంభం

Published: Monday April 30, 2018

డెహ్రాడూన్‌: ఛార్‌దామ్‌ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్‌ ఆలయం ఆదివారం తెరుచుకోగా.. ఈరోజు ఉదయం బద్రీనాథ్‌ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తరఖాండ్‌లోని బద్రీనాథ్‌ పట్టణంలోని ఆలయ తలుపుల్ని ఆరునెలల విరామం తర్వాత పూజారులు ప్రత్యేక పూజలు చేసి తెరిచారు. దేశం సుభీక్షంగా ఉండాలని బద్నీనాథుడిని ప్రార్థించారు. బద్రీనాథుడి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది భక్తులు.. భక్తిగీతాలు, కీర్తనలతో స్వామి మహిమలను కీర్తించారు. హిమాలయ శ్రేణుల్లో కొలువైన కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల సందర్శనకు ఏటా దేశవిదేశాల నుంచి లక్షల మంది భక్తులు వస్తుంటారు.