చానల్స్ నిషేధంపై పవన్ వ్యాఖ్యలు

Published: Friday September 27, 2019

చానల్స్ నిషేధంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందేశాన్ని పోతిన మహేష్ వినిపించారు. ఆ సందేశంలో ప్రభుత్వాలు మరినప్పుడల్లా మీడియాపై నిషేధం విధిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అధికారం ఇస్తే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాల రాయడమేనని స్పష్టం చేశారు. పత్రికల గొంతు నొక్కాలని చూస్తే వారికే ఇబ్బందులు ఎదురౌతాయన్నారు. జర్నలిస్టుల పోరాటానికి జనసేన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.