ఉత్కంఠకు తెరదించిన గంటా

Published: Wednesday October 09, 2019

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉత్కంఠకు తెరదించారు. కొంతకాలంగా ఆయన టీడీపీ కార్యాలయం మెట్లు ఎక్కడం లేదు. అలాగే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి గంటా హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠ టీడీపీలో నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ గంటా నేడు టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.