పాఠశాల నుంచి తిరిగొస్తూ బాలుడి దుర్మరణం

Published: Tuesday January 02, 2018

కె.కోటపాడు: కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ సంతోషంతో వేడుకలు చేసుకుంటున్న తరుణంలో à°“ కుటుంబం కోలుకోలేని విషాదంలో మునిగిపోయింది. ముద్దుముద్దు మాటలు చెబుతూ బడికి వెళుతున్న కొడుకు అదే బడి బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోవడం కన్నవారిని కలచివేసింది. కె.కోటపాడు మండలం గుల్లిపల్లికి చెందిన ఐదేళ్ల చిన్నారిని చుక్క విసిదీప్‌ (5) సోమవారం పాఠశాల బస్సు à°•à°¿à°‚à°¦ పడి మృతి చెందాడు. కె.కోటపాడు ఎస్‌.ఐ. à°Žà°‚.వి.రమణ తెలిపిన వివరాల ప్రకారం... గుల్లిపల్లికి చెందిన చుక్క శ్రీనివాస్‌, రేవతి దంపతుల కుమారుడు విసిదీప్‌. కె.కోటపాడును ఆనుకుని ఉన్న బత్తివానిపాలెం పంచాయతీ పరిధిలోగల ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుకుంటున్నాడు. పాఠశాలకు చెందిన బస్సులో నిత్యం గుల్లిపల్లి నుంచి రాకపోకలు సాగిస్తుంటాడు. ఎప్పటి మాదిరిగానే సోమవారం బస్సులో పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాడు. బస్సు దిగి రోడ్డు దాటేందుకు దానిముందు నుంచి వెడుతుండగా డ్రైవరు గమనించకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో విసిదీప్‌ అదే బస్సుకింద పడి నలిగిపోయాడు. తీవ్రంగా గాయపడటాన్ని గమనించి వెంటనే కె.కోటపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. రోజూ పాఠశాలకు వెళ్లొచ్చే బస్సే చివరకు మృత్యువై తమ ఒక్కగానొక్క కుమారుడిని కబళించిందంటూ  తల్లిదండ్రులు రోదిస్తున్నారు. తండ్రి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌.ఐ. రమణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.