రైతులకు మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ

Published: Saturday December 28, 2019
రాజధానిని అమ్మేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి కుట్ర పన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాజధాని ప్రాంత రైతులకు బాసటగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో శుక్రవారం ఆయన మౌనదీక్ష నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని భూములను నచ్చిన వారికి అమ్ముతామని వైసీపీ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు.
 
 
నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను జగన్‌ నిట్టనిలువునా ముంచుతారని ఎవరూ ఊహించలేదన్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాన్ని గుర్తించి పన్ను చెల్లింపుల విషయంలో కేంద్రం మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రికరణకు బీజేపీ మద్దతు ఉంటుంది తప్ప.. పరిపాలన వికేంద్రీకరణకు కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీజేపీ పోరాటం చేస్తుందని, మొదటి అడుగుగా మౌన దీక్ష చేశామని కన్నా వివరించారు.