ఇంద్రకీలాద్రిపై పాలకమండలి కీలక నిర్ణయం

Published: Wednesday May 16, 2018

విజయవాడ: à°‡à°‚ద్రకీలాద్రిపై అర్జునుడి గుడి పునర్నిర్మాణానికి దుర్గగుడి పాలకమండలి ఆమోదం తెలిపింది. బుధవారం దుర్గగుడి పాలకమండలి సమావేశమైంది. సమావేశంలో చైర్మన్ గౌరంగబాబు, సభ్యులు, ఈవో à°Žà°‚ పద్మ పాల్గొన్నారు. శాంతి కళ్యాణం టిక్కెట్ ధర రూ.500 నుంచి వెయ్యికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గొల్లపూడిలో జి ప్లస్-4 భవనం నిర్మించాలని నిర్ణయించారు. కేశఖండనశాల క్షురకులు అనారోగ్యంతో మరణిస్తే.. కుటుంబీకులకు ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనను తిరస్కరించారు. శివాలయం వద్ద ఉత్తరభాగంలో గ్రీనరీ ప్రతిపాదనను వాయిదా వేశారు.