సినీ పరిశ్రమలో మరో విషాదం.........

Published: Thursday May 17, 2018

తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు..అదృష్టం బాగుంటే..స్టార్ హోదా కలిసి వస్తే..జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుందని భావించే వారు ఎంతో మంది ఔత్సాహికులు ఉన్నారు. అందుకే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. స్టూడియోల చుట్టూ తిరగడం..బ్రోకర్లను నమ్మి డబ్బు పోగొట్టుకోవడం..కొంత మంది అమ్మాయిలు అయితే తమ శీలాన్నేఫనంగా పెట్టిన సంఘటనలు ఉన్నాయి.Image result for oka ammayi thappa images

ఏది ఏమైనా ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్ నా టాలెంట్ ఏంటో చూపిస్తా అనే వారు వేల మంది ఉన్నారు. అయితే చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ పొందలేక జీవితం అగమ్య గోచరంగా మారిన నటీనటులు..దర్శక, నిర్మాతలు కూడా చాలా మందే ఉన్నారు. సినీపరిశ్రమ నుంచి బయటకు రాలేక..ఇక్కడే మనలేక జీవితాన్ని ముగించుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు.

 

తాజాగా వర్దమాన దర్శకుడు రాజ సింహ ఆత్మహత్యకు యత్నించారు.. ముంబైలో నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు.. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చూసిన బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.Image result for oka ammayi thappa director   images

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రుద్రమదేవి' చిత్రానికి రాజసింహ మాటలు రాశారు. అందుకు గానూ మంచి ప్రశంసలే అందుకున్నారు రాజసింహ. సినీ పరిశ్రమలో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో మనస్తాపంతోనే రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అంటున్నారు బంధువులు.