కరోనాతో మెదడుకూ నష్టమే!

Published: Saturday June 27, 2020

 à°•à°°à±‹à°¨à°¾ వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం à°“ పిడుగులాంటి వార్త చక్కర్లు కొడుతోంది. కరోనా ప్రభావం ఇప్పటివరకు ఊపిరితిత్తులపైనే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అయితే మానవ మెదడుపై కూడా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్. దీనిని చూసి అగ్రరాజ్యాలు సైతం వణికిపోతున్నాయంటే అతిశయోక్తికాదు. à°ˆ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం ఊపిరితిత్తులపై ఉండడంతో బాధితులు శ్వాస తీసుకోలేక మరణిస్తున్నారు. ఏ విధంగానైనా దీనిని ఎదుర్కోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. 

 

దీంతో పలు దేశాల్లో శాస్త్రవేత్తలు కరోనాపై మరింత లోతుగా అధ్యయనం చేయడంలో తలమునకలై ఉన్నారు. à°ˆ నేపథ్యంలో కొన్ని షాకింగ్  విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఇటీవల కొంతమంది హార్ట్ ఎటాక్, మతిమరుపు తదితర మానసిక రుగ్మతలకు గురై ఆసుపత్రుల్లో చేరారట. వీరిని విచారించగా వీరంతా కరోనా బారిన పడినట్లు వెల్లడైంది. దీంతో శాస్త్రవేత్తలు à°ˆ కోణంలో కూడా ప్రయోగాలు ప్రారంభించారు. ముఖ్యంగా నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని పరిశోధన చేశారు. à°ˆ పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 

 

à°ˆ సందర్భంగా లివర్ పూల్ యూనివర్సిటీ న్యూరాలజిస్ట్ బెనెడిక్ట్ మైకెల్ దీనిపై స్పందించారు. కరోనా బాధితుల్లో కొందరిలో మాత్రమే నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటోందని ఆయన తెలిపారు. అది కూడా అనేక సమస్యలతో కూడిన అరుదైన లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు. అయితే దీనికి సరైన ఆధారాలు పూర్తిగా లభించలేదని చెప్పారు. à°ˆ నేపథ్యంలో 125మందిపై ప్రరిశోధన చేయగా 77మంది బ్రెయిన్ బ్లడ్ ఫ్లోలో తేడాలు ఉన్నట్లు గమనించారు. వీరిలో అనేకమందిలో మెదడులో రక్తం గడ్డకట్టినట్లు పరిశోదనల్లో తేలింది. ఇలా రక్తం గడ్డకట్టడం వల్ల బాధితులు హార్ట్ స్ట్రోక్‌ బారిన పడే ప్రమాదం పెరుగుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా పరిశోధనకు సహకరించిన 125 మందిలో ఎక్కువశాతం కన్ఫ్యూజన్, పర్సనాలిటీలో మార్పులు, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపించసాగాయని వివరించారు. అరవై ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారిలో సగంమంది మానసిక పరిస్థితి గణనీయంగా మారిపోయిందని మైకెల్ తెలిపారు.