డ్రాగన్‌కు మరో షాకిచ్చిన మోదీ

Published: Wednesday July 01, 2020

న్యూఢిల్లీ: 59 చైనా యాప్‌లను నిషేధించి చైనాకు షాకిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా మరో ఝలక్ ఇచ్చారు. చైనా సోషల్ మీడియా వీబోను మోదీ వదిలిపెట్టారు. వీబో అకౌంట్‌లో గతంలో పెట్టిన ప్రొఫైల్ ఫొటోతో పాటు పూర్తి వివరాలను, కామెంట్లను, పోస్టులను, ఫొటోలను తొలగించారు. ప్రస్తుతం à°ˆ పేజీ పూర్తి బ్లాంక్‌à°—à°¾ కనపడుతోంది. 2015లో ప్రధాని వైబోలో అకౌంట్ తెరిచారు. ప్రధానిగా చైనాలో పర్యటించే ముందు మోదీ à°ˆ ఖాతా తెరిచారు. వైబోలో మోదీకి 2,44,000 మంది ఫాలోయర్లున్నారు. వీరిలో ఎక్కువ మంది చైనీయులే. చైనా భాషలోనే మోదీ à°ˆ ఖాతా నడిపారు. 

 

జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాలు కుట్ర చేశాయి. కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. చైనాతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఓ వైపు యత్నిస్తూనే మిగతా విషయాల్లోనూ మోదీ సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా పెద్ద సంఖ్యలో బలగాలను మోహరిస్తుండటంతో భారత్ కూడా సైన్యాన్ని తరలించింది. భారత విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది.