కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Published: Wednesday July 01, 2020

కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవించే హక్కును కాలరాసేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధర్మాసనం పేర్కొంది. 17à°µ తేదీన కోర్టు సంతృప్తి చెందకపోతే.. జూలై 20à°¨ చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ హాజరుకావాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించకపోతే కోర్టు ధిక్కరణగా భావిస్తామని, ఆర్.ఏ.à°¡à±€. బ్లడ్ శాంపీల్స్ ఎందుకు చేయకూడదని, 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే పరీక్షలు చేయాలని ఆదేశించామని తెలిపింది. ఎన్ని యూనిట్స్ తెచ్చారని, ఎందుకు ఇప్పటి వరకు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. 50 వేల టెస్టులు చేస్తామని చెప్పి.. మూడు రోజులు అసలే టెస్టులు చేయలేదని కోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది తీసుకెళ్లారు. ఇప్పటికైనా ఆర్.ఏ.à°¡à±€. శాంపిల్స్ సేకరించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారని, ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జూన్ 26à°¨ ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సెంట్రల్  టీం ఎక్కడెక్కడ పర్యటించిందన్న అంశాలను à°ˆ నెల 17à°¨ తెలపాలని హైకోర్టు పేర్కొంది. జీవించే హక్కును హరించే లా ప్రభుత్వం వ్యవహారింస్తుందని ఘాటు వ్యాఖ్యాలు చేసింది. హక్కులను కాలరాస్తుందని గుర్తిస్తున్నామని, అవిధంగా ప్రభుత్వం చేయరాదని గుర్తుంచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జూన్ 26à°¨ టెస్టులు ఎందుకు అపేయాల్సి వచ్చిందని, 50 వేలు చేస్తామని చెప్పి.. కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని చెప్పుతూ.. టెస్టులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించామని, డాక్టర్లకు పారమెడికల్ స్టాప్ à°•à°¿ పీపీఈ కిట్స్ ఎన్ని ఇచ్చారో తెలపాలని హైకోర్టు వెల్లడించింది. ఏప్రిల్ 21, జూన్ 8, జూన్ 18à°¨ ఎన్నెన్ని కిట్స్ ఇచ్చారని, దీన్ని కూడా కోర్టు ధిక్కరణ à°•à°¿à°‚à°¦ తీసుకుంటున్నామని, 17à°µ వరకు ఆదేశించిన పనులు పూర్తి చేయకపోతే అధికారులు హాజరుకావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.