గాయపడిన జవాన్లకు మోదీ పరామర్శ

Published: Friday July 03, 2020

 à°—ల్వాన్ ఘటనలో గాయపడిన జవాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. నాటి ఘటన గురించి నేరుగా సైనికులను à°…à°¡à°¿à°—à°¿ వివరాలు తెలుసుకున్నారు. జవాన్ల భుజం తట్టి వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. 

 

లడక్ గల్వాన్ లోయలో జూన్ 15న బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాలు కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయినా డ్రాగన్ కంట్రీ క్లారిటీ ఇవ్వలేదు. 45 మంది దాకా చనిపోయారని కథనాలు వచ్చినా చైనా స్పష్టం చేయలేదు. గల్వాన్ ఘటన తర్వాత భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. వాస్తవాధీన రేఖ వెంబడి వేలాది మంది సైనికులను రెండు దేశాలూ మోహరించాయి.