తెలుగు సాహిత్యానికి తీరని లోటు.. యద్దనపూడి కన్నుమూత

Published: Monday May 21, 2018

వృద్ధాప్యం మీద పడటంతో తన కుమార్తె శైలజ వద్ద కాలం గడుపుతున్న యద్దనపూడి సులోచనారాణి 79 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. గత రాత్రి నిద్రలోనే ఆమె కన్నుమూశారని శైలజ వెల్లడించారు. గుండెపోటు వచ్చిందన్న విషయం ఎవరికీ తెలియదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేకపోయిందని ఆమె తెలిపారు.

Related image

తన తల్లి అంత్యక్రియలు స్వదేశంలో చేయాలని ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించని కారణంగా కుపర్డినోలోనే ముగించనున్నట్టు స్పష్టం చేశారు. తమకు ఎంతో మంది ఫోన్ కాల్స్ చేసి సంతాపం చెబుతున్నారని, వారందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలని అన్నారు. తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన యద్దనపూడి సులోచనారాణి మృతి నవలా లోకానికి తీరని లోటని పలువురు రచయితలు వ్యాఖ్యానించారు.