అశోక్ గెహ్లోత్ నోట... నలుగురు టీడీపీ ఎంపీల మాట

Published: Friday July 31, 2020

రాజస్థాన్ రాజకీయం రంగు మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైపూర్ నుంచి జైసల్మేర్ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోవడాన్ని ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

‘‘టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను రాత్రికి రాత్రే బీజేపీలోకి విలీనమయ్యారు. అలా విలీనం కావడం సరైందని వాదిస్తారు. రాజస్థాన్ లో 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనమయ్యారు. దీన్ని మాత్రం తప్పంటారు. టీడీపీ ఎంపీలు విలీనమైనప్పుడు బీజేపీ వాదన ఎటు పోయింది? రాజ్యసభలో విలీనం కావడం సరైనదే, రాజస్థాన్ లో విలీనం కావడం మాత్రం తప్పంటారు’’ అంటూ బీజేపీపై గెహ్లోత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.