మసీదు శంకు స్థాపనకు వెళ్తారా?

Published: Wednesday August 05, 2020

అయోధ్యలో జరగబోయే మసీదు శంకుస్థాపనకు వెళ్తారా? అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించగా... నవ్వుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను ఎవ్వరూ పిలువరు. నేనూ వెళ్లను’’ అని కుండ బద్ధలు కొట్టారు. అన్ని మత విశ్వాసాలను గౌరవించే యోగి... మసీదు శంకు స్థాపనకు వెళ్తారా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి... దీనికి మీ సమాధానం అని à°“ జాతీయ ఛానల్ అడగ్గా... ‘‘నన్ను ఎవరూ పిలువరు. నేనూ వెళ్లను. నా పని ఏదుందో దానిని నేను చేస్తాను. నా పనిని ధర్మంగా, కర్తవ్యంగా భావిస్తూ... పని చేస్తుంటా. నన్ను ఎవ్వరూ పిలువరు. నేనూ వెళ్లను’’ అని యోగి స్పష్టం చేశారు.