పిడుగుపడి రైతు మృతి

Published: Wednesday May 23, 2018

జగిత్యాల జిల్లా మెటుపల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో పిడుగుపడి బద్ధం రాజరెడ్డి(60) అనే రైతు మృతి చెందాడు. తోటపనికి వెళ్లి రాజరెడ్డి వర్షం పడుతుండటంతో చెట్టుకిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడటంతో అతడు మృతిచెందాడు. రాజరెడ్డి మృతితో కుటుంబంలో విషాదం అలముకుంది.