వదంతులు వ్యాపింప చేసే వారిపై తగిన చర్యలు తీసుకోండి ..

Published: Wednesday May 23, 2018

రాష్ట్రంలో అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ముమ్మరం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వదంతులు వ్యాపించేవారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలపై ఈరోజు సమీక్ష నిర్వహించాలని డీజీపీని సీఎం ఆదేశించారు. వదంతులు వ్యాపింపచేసి ప్రజల్లో భయం పెంచేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.