ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం..

Published: Monday August 24, 2020

కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు తథ్యంగా కనిపిస్తోందన్న చర్చోపచర్చల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు ఏడు à°—à°‚à°Ÿà°² పాటు సుదీర్ఘంగా à°ˆ సమావేశం సాగింది. ప్రస్తుతానికి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని పార్టీ ముఖ్య నేతలంతా సీడబ్ల్యూసీలో తీర్మానించారు. రాబోయే 6 నెలల్లో పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. దీంతో.. నాయకత్వ బాధ్యతల నుంచి సోనియా తప్పుకోనున్నారన్న వార్తలకు తెరపడింది. సోనియా రాజీనామా చేశారని, ఇక రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ ముందుకెళ్లనుందనే వార్తలు తెరపైకొచ్చాయి. అయితే.. సీడబ్ల్యూసీ తాజా ప్రకటనతో ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది.