ఫస్ట్ టైమ్ స్పందించిన సీఎం జగన్

Published: Tuesday August 25, 2020

 à°¤à±‚ర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన ఇండుగిమిల్లి వరప్రసాద్‌ శిరోముండనం కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం విదితమే. à°ˆ కేసు వ్యవహారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దాకా కూడా చేరింది. à°ˆ కేసు విషయమై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫస్ట్ టైమ్ స్పందించారు.

మంగళవారం నాడు బెంగళూరుకు బయల్దేరే ముందు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. à°ˆ సందర్భంగా దళితులపై దాడులను, అనైతిక చర్యలపై నిశితంగా చర్చించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. బాధ్యులు ఎంతటి వారైనా సరే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపామన్న విషయాన్ని జగన్‌ à°ˆ సందర్భంగా గుర్తు చేశారు. దళితులమీద దాడులు సహా, ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదన్నారు. కానీ à°—à°¤ ప్రభుత్వానికి.. à°ˆ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది జగన్ చెప్పుకొచ్చారు.

తప్పు ఎవరు చేసినా తప్పేనని.. మన ప్రభుత్వం ఆలోచనలో ఉన్న స్పష్టత ఇదేనని కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ చెప్పారు. గతంలో దళితులపై జరగరానివి జరిగితే ఎక్కడా చర్యలు తీసుకోలేదన్నారు. à°ˆ వ్యవస్థలో మార్పు రావాలి.. à°† దిశలోనే పలు చర్యలు తీసుకుంటామన్నారు. గుండు కొట్టించడంలాంటి ఘటనలు తప్పు అని జగన్ వ్యాఖ్యానించారు. మన పోలీసు ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం బాధాకరమేనని జగన్‌ తెలిపారు.