నేడు పులివెందులలో పర్యటన చేయనున్న సీఎం చంద్రబాబు

Published: Wednesday January 03, 2018

à°•à°¡à°ª: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... నేడు జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో  పర్యటించనున్నారు. లింగాల మండలం లొ ఉన్న పార్నపల్లె గ్రామం వద్ద నిర్మించిన గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్నిముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు పులివెందులలో జరిగే జన్మభూమి గ్రామసభలో  మధ్యాహ్నం 2గంటలకు సమయంలొ అయన పాల్గొననున్నారు.వైఎస్ కుటుంబానికి రాజకియ పరంగా దన్నుగా నిలుస్తున్న పులివెందుల నియొజకవర్గం లొ టిడిపి పలు వైయస్ కార్యకర్తలను ముఖ్య నెతలను టిడిపి లొ చెర్చుకునె వ్యుహం లొ టిడిపి కనిపిస్తుంది . . వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి షాక్ ఇవ్వాలనే నిర్ణయంతో పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే  ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగలొకి దిగారనెది సమాచారం. à°ˆ భాగంగానే నేడు పులివెందులలో జరిగే జన్మభూమి కార్యక్రమానికి విచ్చేస్తున్నారని తెలుస్తుండగా... అటు అధికారిక కార్యక్రమంతోపాటు ఇటు పార్టీని అభివృద్ధి చేసుకునే దిశగా వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.