ప్రైవేట్ బస్సులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Published: Monday September 07, 2020

విజయవాడ- హైదరాబాద్‌ రూట్‌లో ప్రైవేట్‌ బస్సులను ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ బస్సులపై తెలంగాణ ప్రభుత్వంతో వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా ఇక ప్రైవేట్ బస్సుల రాకపోకలకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పన్నులు చెల్లించి క్లియరెన్స్‌ తీసుకోవాలని ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడపాలని ఆదేశించింది.