జగన్‌పై ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సీరియస్‌

Published: Wednesday October 14, 2020

 à°à°ªà±€ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై జోక్యం చేసుకునే నికృష్టమైన ప్రయత్నాలను సీఎం జగన్‌ మానుకోవాలని బార్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది. సీజేఐకి సీఎం జగన్‌ లేఖ రాయడాన్ని తప్పుబట్టింది. న్యాయవ్యవస్థను కించపరిచేలా, బురదజల్లేలా జగన్‌ లేఖ ఉందని, జగన్‌ చర్యలను అత్యంత తీవ్రమైన పదజాలంతో ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మచ్చలేని వ్యక్తి అని, అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. జస్టిస్‌ ఎన్వీ రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారని, అత్యుత్తమ నిబద్ధతగల న్యాయమూర్తుల్లో జస్టిస్‌ ఎన్వీ రమణ ఒకరని, ఆయనపై జగన్‌ ఆరోపణల్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ పేర్కొంది.