ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు..

Published: Monday May 28, 2018

తెలుగువారు "అన్నగారు" అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు జయంతి నేడు. à°ˆ సందర్భంగా నందమూరి హరికృష్ణ, జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, బాలకృష్ణ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. ఉదయమే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న వారంతా ఎన్టీఆర్‌ సమాధి వద్ద పుష్ఫాలు ఉంచి నివాళులర్పించారు.

à°ˆ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. ఎన్టీఆర్‌ జీవిత విశేషాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులు , తెలుగుదేశం కార్య కర్తలు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జైనతీ వేడుకను జరుపుకుంటున్నారు. మరోపక్క విజయవాడ లో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటుంది.