హైదరాబాద్ కోటపై త్రిశూల వ్యూహం

Published: Wednesday November 11, 2020

 à°¦à±à°¬à±à°¬à°¾à°•à°¨à± బద్దలు కొట్టి విజయబావుటా ఎగురవేసిన కమలనాథులు అదే ఊపులో గ్రేటర్ కోటపై కూడా కాషాయ జెండా ఎగరవేయాలని అనుకుంటున్నారు. అందుకు మూడు అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. దుబ్బాకలా ఈజీ కాదు  జీహెచ్ఎంసీని గెలవడం. అందుకే త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలనుకుటుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌కు చుక్కులు చూపించాలనుకుంటున్నారు. మరోవైపు గులాబీ సేన అప్పటిలాగే సెంచరీ కొట్టాలనుకుంటోంది. కాంగ్రెస్‌ను పక్కకు నెట్టేసి మరీ దూసుకొస్తోన్న కమలం..గులాబీ పార్టీని సెంచరీ కొట్టనిస్తుందా?. లేక త్రిశూల వ్యూహంతో క్లీన్ బౌల్డ్ చేస్తుందా?. ఇంతకూ à°† త్రిశూల వ్యూహమేంటి?. 

 

 

బీజేపీ ఇప్పుడు గెలుపు ఉత్సాహంలో ఉంది. దుబ్బాక దూకుడుతోనే గ్రేటర్ హైదరాబాద్ కథనరంగంలోకి దూకుదామనుకుంటోంది. అధికార పార్టీ టీఆర్ఎస్‌ను à°“à°¡à°¿à°‚à°šà°¡à°‚ అసాధ్యమనుకున్నవారికి దుబ్బాకతో టీజర్ ఇచ్చామంటున్నారు. తర్వాత గ్రేటర్‌తోనే మరో బ్లాస్ట్ చేస్తామంటున్నారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. à°ˆ మధ్య కాలంలో కమల నాథుల ప్రసంగాలను పరిశీలిస్తే వారి వ్యూహమేంటో అర్ధమైపోతోంది.