గ్రేటర్‌లో ముగిసిన నామినేషన్ల గడువు

Published: Friday November 20, 2020

గ్రేటర్ నామినేషన్ల గడువు ముగిసింది. à°ˆ సారి నామినేషన్లకు మూడు రోజులే గడువు ఉండటంతో అభ్యర్థులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. చివరి నిమిషం వరకూ అధికారులు నామినేషన్లు సేకరించారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం అత్యధికంగా 600లకు పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. 

 

చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులతో జోనల్ కమిషనర్ల కార్యాలయాలు కిటకిటలాడాయి.గురువారం వరకు 537 మంది అభ్యర్థులు 597 నామిషన్లు దాఖలు చేశారు. మొత్తం నామినేషన్ల సంఖ్య 1000కి పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం నామినేషన్లననీ పరిశీలిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు.